AP News: శ్రీశైలం జలాశయానికి భారీగా సందర్శకుల తాకిడి
ABN , First Publish Date - 2022-08-14T20:56:43+05:30 IST
కృష్ణమ్మ పరవళ్లతో శ్రీశైలం జలాశయం (Srisailam reservoir) నిండుకుండలా మారింది. దీంతో డ్యాం వద్ద సందర్శకుల తాకిడి పెరిగింది.
నంద్యాల: కృష్ణమ్మ పరవళ్లతో శ్రీశైలం జలాశయం (Srisailam reservoir) నిండుకుండలా మారింది. దీంతో డ్యాం వద్ద సందర్శకుల తాకిడి పెరిగింది. శ్రీశైలం ఘాట్రోడ్డులో 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. శ్రీశైలం నుంచి హటకేశ్వరం ముఖద్వారం వరకు భారీగా ట్రాఫిక్ (Traffic) జామ్ అయింది. ఎగువ కురిసిన వర్షాలతో జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం కుడి, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.