ప్రత్యేక హోదా కేవలం ఏపీకి సంబంధించిన అంశం: జీవీఎల్‌

ABN , First Publish Date - 2022-02-13T00:13:20+05:30 IST

ప్రత్యేక హోదా కేవలం ఏపీకి సంబంధించిన అంశమని ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు పేర్కొన్నారు. కేంద్రహోంశాఖ ఆధ్వర్యంలో

ప్రత్యేక హోదా కేవలం ఏపీకి సంబంధించిన అంశం: జీవీఎల్‌

ఢిల్లీ: ప్రత్యేక హోదా కేవలం ఏపీకి సంబంధించిన అంశమని ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు పేర్కొన్నారు. కేంద్రహోంశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ.. రెండు రాష్ట్రాల అధికారులతో చర్చలు జరుపుతుందని తెలిసిందన్నారు. ఏపీ ప్రత్యేక హోదా, రిసోర్స్ గ్యాప్‌పై చర్చ ఉంటుందని వార్తలు వచ్చాయని, ఇదే అంశంపై కేంద్రహోంశాఖ అధికారులతో మాట్లాడటం జరిగిందని జీవీఎల్ తెలిపారు. కేంద్ర హోంశాఖ నిర్వహించే సమావేశంలో ప్రత్యేక హోదా.. ఇతర అంశాలపై చర్చలేదని అధికారులు చెప్పారని పేర్కొన్నారు. ఏపీకి సహాయం అందించేందుకు ప్రధాని మోదీ సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. కేంద్రం హోంశాఖ ఏర్పాటు చేసిన కమిటీ కేవలం రెండు రాష్ట్రాల మధ్య.. ఆర్థికపరమైన అంశాలను మాత్రమే పరిష్కరిస్తుందని జీవీఎల్‌ తెలిపారు.

Updated Date - 2022-02-13T00:13:20+05:30 IST