టీడీపీ ఎమ్మెల్యే Payyavula keshavకు భద్రత కుదింపు
ABN , First Publish Date - 2022-07-11T16:51:47+05:30 IST
టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్కు ఏపీ సర్కార్ భద్రతను కుదించింది.
అమరావతి: టీడీపీ (TDP) ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్(PAC chairman) పయ్యావుల కేశవ్(Payyavula keshav)కు ఏపీ సర్కార్(AP government) భద్రతను కుదించింది. గన్మెన్లను వెనక్కి రావాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల తనకు భద్రత(Security) పెంచాలని ప్రభుత్వానికి పయ్యావుల కేశవ్ లేఖ రాసిన విషయం తెలిసిందే. కాగా 4 రోజుల క్రితం పెగాసస్పై ఎమ్మెల్యే పయ్యావుల సంచలన వ్యాఖ్యలు చేశారు. కేశవ్ వ్యాఖ్యలు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి. ఈ క్రమంలో ప్రభుత్వం గన్మెన్లను ఉపసంహరించుకుందంటూ టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.