Kodela Sivaram: సత్తెనపల్లిలో పోటీపై సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2022-08-07T03:13:09+05:30 IST
2024లో సత్తెనపల్లి (Sattenapally) నుంచి పోటీ చేస్తున్నానని టీడీపీ నేత కోడెల శివరాం (Kodela Sivaram) ఓ ప్రకటనలో అన్నారు. సత్తెనపల్లిలో ...
పల్నాడు జిల్లా: 2024లో సత్తెనపల్లి (Sattenapally) నుంచి పోటీ చేస్తున్నానని టీడీపీ నేత కోడెల శివరాం (Kodela Sivaram) ఓ ప్రకటనలో అన్నారు. సత్తెనపల్లిలో పోటీ చేస్తానని అంబటి రాంబాబు (Ambati Rambabu)కి ప్రకటించే దమ్ము ఉందా ఆయన సవాల్ విసిరారు. ఓడినా, గెలిచినా తాను సత్తెనపల్లి ప్రజలతోనే ఉంటానని చెప్పారు. అధికారం లేకపోతే సత్తెనపల్లిలో అంబటి ఉండగలడా అని ప్రశ్నించారు. మూడేళ్లలో తనపై ఎన్నో కేసులు పెట్టి రకరకాలుగా ఇబ్బందులు పెట్టారని మండిపడ్డారు. పాలు పోసిన వాళ్లే పాముల్లా కాటేస్తున్నారని వ్యాఖ్యానించారు. అన్నింటిని ఎదుర్కొంటానని.. వారిందరికి సమాధానంగా కోడెల బిడ్డగా సత్తెనపల్లిలో పోటీ చేసి గెలిచి తీరుతానని కోడెల శివరాం దీమా వ్యక్తం చేశారు.