తిరుపతిలో రూ.50లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం

ABN , First Publish Date - 2022-01-30T11:57:14+05:30 IST

వాహనంతోపాటు రూ.50లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి డివిజన్‌ ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌

తిరుపతిలో రూ.50లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం

తిరుపతి: వాహనంతోపాటు రూ.50లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి డివిజన్‌ ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ (ఎఫ్‌ఆర్‌వో) దొరస్వామి మీడియాకు శనివారం వివరాలు తెలిపారు. ముందుగా అందిన సమాచారం మేరకు డీఎ్‌ఫవో ఆదేశాలతో డాగ్‌ స్క్వాడ్‌, సిబ్బందితో కలసి దొరస్వామి శ్రీకాళహస్తి నుంచి రేణిగుంట వైపు వచ్చే వాహనాలను శుక్రవారం సాయంత్రం తనిఖీ చేస్తున్నారు. ఇంతలో ఓ కారు ఏర్పేడు నుంచి రేణిగుంటవైపు వేగంగా వస్తుండగా ఆపారు. 


కానీ ఆ వాహనం ఆగకుండా వెళ్లిపోవడంతో వెంబడించారు. ఈ క్రమంలో కారు పంక్చరు కావడంతో అందులోనివారు వాహనాన్ని వదిలి పరారయ్యారు. డాగ్‌ స్క్వాడ్‌ సాయంతో వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించగా.. సీట్ల కింద కనిపించకుండా దాచి ఉంచిన 16 ఎర్రచందనం దుంగలను గుర్తించారు. కారుతోపాటు వాటిని స్వాధీనం చేసుకున్నారు. దుంగల బరువు 502 కిలోలుండగా, దాదాపు రూ.50 లక్షలకుపైగా విలువ ఉంటుందని ఎఫ్‌ఆర్‌వో తెలిపారు. ఈ దాడిలో డీఆర్‌వోలు విజయకుమార్‌, షరీఫ్‌, సికిందర్‌, ఎఫ్‌బీవోలు జాన్‌, పురుషోత్తం, పీడబ్ల్యూఎస్‌ మోహన్‌, సునీల్‌, లీలాప్రసాద్‌, క్రాంతికుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-01-30T11:57:14+05:30 IST