విజయనగరం జిల్లాలో ఆర్టీసీ బస్సుకి తప్పిన ప్రమాదం
ABN , First Publish Date - 2022-04-12T00:33:02+05:30 IST
జిల్లాలో ఆర్టీసీ బస్సుకి పెను ప్రమాదం తప్పింది.
విజయనగరం: జిల్లాలో ఆర్టీసీ బస్సుకి పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు నుంచి ఆయిల్ ట్యాంక్ ఊడి పడిపోయింది. ఈ సంఘటన గజపతినగరం మండలం మరుపల్లిలో జరిగింది. తోటి వాహనదారులు వెంటనే డ్రెవర్ని అప్రమత్తం చేయడంతో ఈ ప్రమాదం తప్పింది. ఆయిల్ ట్యాంక్ ఊడి పడిపోవడంతో డీజిల్ రోడ్డుపై భారీగా పోయింది. ఈ ఆర్టీసీ బస్సు విశాఖ నుంచి పార్వతీపురం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.