50 వేలతో రోబో ఆవిష్కరణ.. స్విమ్స్కు బహూకరణ
ABN , First Publish Date - 2022-01-01T08:02:06+05:30 IST
50 వేలతో రోబో ఆవిష్కరణ.. స్విమ్స్కు బహూకరణ
తిరుపతి (సిటీ/విశ్వవిద్యాలయాలు), డిసెంబరు 31: తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రికి శుక్రవారం ఓ రోబోను బహుమతిగా అందింది. కరోనా నేపథ్యంలో రోగులకు సేవలు అందించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయం టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ సహకారంతో పలమనేరుకు చెందిన యువశాస్త్రవేత్త పవన్ ఈ రోబోను తయారు చేశారు. మహిళా వర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ రోబోను స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అందజేశారు. రూ.50వేలతో దాన్ని తయారు చేసినట్లు పవన్ తెలిపారు.