పులస.. కిలో రూ.17వేలు
ABN , First Publish Date - 2022-10-11T09:23:58+05:30 IST
మత్స్యకారుడి పంట పండింది. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం కేదార్లంక గోదావరిలో
మత్స్యకారుడి పంట పండింది. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం కేదార్లంక గోదావరిలో సోమవారం సందాడి సత్యనారాయణ వలలో పులస చేప పడింది. కిలో బరువు ఉన్న ఈ పులసను పెదపట్నంలంకకు చెందిన నల్లి రామ్ప్రసాద్ రూ.17వేలకు కొనుగోలు చేశారు.