Tenth students: గంజాయి తాగింది కాకుండా పైగా దౌర్జన్యం

ABN , First Publish Date - 2022-12-20T15:14:52+05:30 IST

పర్చూరు ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో(Parchure Tribal Welfare Residential School) దారుణం జరిగింది. ఇద్దరు పదో తరగతి విద్యార్థులు గంజాయి(Ganjayi) సేవించారు. ఈ విషయాన్ని

Tenth students: గంజాయి తాగింది కాకుండా పైగా దౌర్జన్యం
స్కూల్‌లో గంజాయి

బాపట్ల: పర్చూరు ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో (Parchure Tribal Welfare Residential School) దారుణం జరిగింది. ఇద్దరు పదో తరగతి విద్యార్థులు గంజాయి (Ganjayi) సేవించారు. ఈ విషయాన్ని తొమ్మిదో తరగతి విద్యార్థి... ప్రిన్సిపాల్‌ (Principal)కి సమాచారం చేరవేశాడు. ప్రిన్సిపాల్‌కి చెప్పాడన్న కోపంతో తొమ్మిదో తరగతి స్టూడెంట్‌ను పదో తరగతి విద్యార్థులు చావబాదారు. అంతటితో ఆగకుండా ఆ పైశాచికత్వాన్ని విద్యార్థులు సెల్‌ఫోన్లో చిత్రీకరించారు. గతేడాది జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం బయటకు రాకుండా ఇప్పటిదాకా స్కూల్ సిబ్బంది జాగ్రత్త పడింది. తాజాగా ఈ వీడియో బయటకు రావడంతో వైరల్ (Video viral) అయింది. ఈ ఘటనపై డిప్యూటీ డీఈవో కిరణ్‌కుమార్ విచారణ చేపట్టారు.

pale.gif

Updated Date - 2022-12-20T15:16:02+05:30 IST