9 నుంచి కేఏ పాల్‌ ‘ప్రజాయాత్ర’

ABN , First Publish Date - 2022-07-07T01:28:18+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసకునేందుకు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌ ‘ప్రజాయాత్ర’ చేపడుతున్నట్టు ఆ పార్టీ ఉభయ తెలుగు

9 నుంచి కేఏ పాల్‌ ‘ప్రజాయాత్ర’

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌ ‘ప్రజాయాత్ర’ చేపడుతున్నట్టు ఆ పార్టీ ఉభయ తెలుగు రాష్ట్రాల కో-ఆర్డినేటర్‌ ఎం.సుస్మిత తెలిపారు. గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆమె యాత్ర షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ నెల 9న విశాఖపట్నంలో పారంభమయ్యే ఈ యాత్ర ఈ నెల 22న కర్నూల్‌లో ముగుస్తుందన్నారు. ప్రజలు తమ సమస్యలను కేఏ పాల్‌కు స్వయంగా తెలియజేయవచ్చని సుస్మిత తెలిపారు.

Updated Date - 2022-07-07T01:28:18+05:30 IST