పోలవరం ప్రాజెక్టుపై ఢిల్లీలో కీలక సమావేశం
ABN , First Publish Date - 2022-03-16T17:35:09+05:30 IST
న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుపై ఢిల్లీలో కీలక సమావేశం ప్రారంభమైంది.
న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుపై ఢిల్లీలో కీలక సమావేశం ప్రారంభమైంది. కేంద్ర జల శక్తి శాఖ కార్యాలయంలో షెకావత్ ఆధ్వర్యంలో ఈ భేటీ జరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు పెండింగ్ అంశాల పరిష్కారంపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ భేటీకి ఏపీ రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులు, డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్ సభ్యులు హాజరయ్యారు. పోలవరం ప్రాజెక్టుపై పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం సమావేశం జరుగుతోంది.