కోడి పందాలను నివారించే దిశగా పోలీసుల చర్యలు

ABN , First Publish Date - 2022-11-25T09:06:27+05:30 IST

సంక్రాంతి పండుగ రానున్న నేపథ్యంలో కోడి పందాలను నివారించే దిశగా పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కోడి కత్తుల తయారీ కేంద్రాలపై విస్సన్నపేటలో సర్కిల్ ఇన్స్పెక్టర్ భీమరాజు అధ్వర్యంలో దాడులు నిర్వహించారు.

కోడి పందాలను నివారించే దిశగా పోలీసుల చర్యలు

Vijayawada : సంక్రాంతి పండుగ రానున్న నేపథ్యంలో కోడి పందాలను నివారించే దిశగా పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కోడి కత్తుల తయారీ కేంద్రాలపై విస్సన్నపేటలో సర్కిల్ ఇన్స్పెక్టర్ భీమరాజు అధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పట్టణ పరిధిలో రెండు తయారీ కేంద్రాలపై నిర్వహించిన దాడుల్లో సుమారు రూ.5 లక్షలు విలువ చేసే 2300 కత్తులను, 5 తయారీ మిషన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని మైలవరం ఏసీపీ రమేష్ హెచ్చరించారు.

Updated Date - 2022-11-25T09:06:29+05:30 IST