రెచ్చగొట్టింది Chandrababu, పేరు పెట్టింది jagan: పిట్టా శివన్నారాయణ
ABN , First Publish Date - 2022-05-28T21:48:36+05:30 IST
అమలాపురం అల్లర్లలో బీజేపీ నేతలపై అక్రమంగా కేసులు పెట్టారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్టా శివన్నారాయణ అన్నారు.
రాజమండ్రి: అమలాపురం అల్లర్లలో బీజేపీ నేతలపై అక్రమంగా కేసులు పెట్టారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్టా శివన్నారాయణ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోనసీమకు అంబేడ్కర్ పేరు పెట్టమని రెచ్చగొట్టింది చంద్రబాబు, పేరు పెట్టింది సీఎం జగన్ అని చెప్పారు.క్విట్ జగన్ ... క్విట్ చంద్రబాబు అనేది బీజేపీ నినాదమన్నారు. కుటుంబ పార్టీలు పోతేనే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పారు. బీజేపీ, జనసేన మధ్య మాత్రమే పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు.గడపగడపకూ వెళ్తుంటే ప్రజలు తిరగబడుతున్నారన్నారు.అందుకే బస్సు యాత్ర చేస్తూ గుంపుగా వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. వచ్చే నెల ఆరు, ఏడు తేదీల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీలో పర్యటిస్తారని పిట్టా శివన్నారాయణ తెలిపారు.