తిరుమల యాత్ర అమరనాథ్ యాత్రలా మారింది: పయ్యావుల కేశవ్
ABN , First Publish Date - 2022-04-14T00:43:00+05:30 IST
తిరుమలకు వెళ్లి రావడమంటే అమరనాథ్ యాత్ర వెళ్లిరావడంలా తయారైందని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విమర్శించారు.
ఉరవకొండ: తిరుమలకు వెళ్లి రావడమంటే అమరనాథ్ యాత్ర వెళ్లిరావడంలా తయారైందని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమలలో పరిస్థితులు ఇంకా చక్కబడలేదని అన్నారు. టీటీడీ పాలకమండలి అసంబద్ధ నిర్ణయాలతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వేసవిలో స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసినా, పాలక మండలి నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయడంపై ప్రభుత్వం, పాలక మండలి పూర్తి స్థాయిలో దృష్టి సారించలేదని విమర్శించారు. సుదర్శనం టిక్కెట్లు తీసుకుని 2 గంటల్లో స్వామి వారి దర్శనం చేసుకునే భక్తులు, తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని పయ్యావుల కేశవ్ తెలిపారు.