ఐటీ ఉద్యోగి తనూజ మృతిపై కొనసాగుతున్న సస్పెన్స్
ABN , First Publish Date - 2022-01-21T00:12:11+05:30 IST
నగరంలో సంచలనం సృష్టించిన ఐటీ ఉద్యోగిని
విజయవాడ: నగరంలో సంచలనం సృష్టించిన ఐటీ ఉద్యోగిని తనూజ మృతిపై సస్పెన్స్ కొనసాగుతోంది. విచారణ కోసం బెజవాడ పోలీసులు గుంటూరు వెళ్లారు. తనూజ గుంటూరు నుంచి విజయవాడ ఎలా వచ్చిందో నిర్ధారణ చేసే పనిలో పోలీసులు ఉన్నారు. ఏటీ అగ్రహారం పరిసర ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్లను పరిశీలించారు. తనూజ మృతదేహంపై బంగారం పోలేదని బంధువులు, పోలీసులు తెలిపారు. గుంటూరులో రోడ్డు ప్రమాదం జరిగితే వైద్యం కోసం బెజవాడ తీసుకొచ్చారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.