ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళన
ABN , First Publish Date - 2022-03-21T23:27:56+05:30 IST
జిల్లాలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటిలో విద్యార్థుల ఆందోళన
కడప: జిల్లాలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. విద్యార్థులు బయటకు రాకుండా పోలీసులు గేట్లుకు తాళాలు వేశారు. మౌలిక వసతులు లేవంటూ నిన్నటి నుంచి విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. రెండు వారాల్లో వసతులు కల్పి స్తామని, ఉండలేకపోతే ఇంటికి వెళ్ళాలని ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ చెప్పారు. ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.