NTR University మరింత అభివృద్ధి చెందాలి: గవర్నర్ బిశ్వభూషన్
ABN , First Publish Date - 2022-07-15T20:35:49+05:30 IST
ఎన్టీఆర్ యూనివర్శిటీ 25వ స్నాతకోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
గుంటూరు: ఎన్టీఆర్ యూనివర్శిటీ(NTR University) 25వ స్నాతకోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్(AP Governor Biswabhushan Harichandan) శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ యూనివర్శిటీ 25వ స్నాతకోత్సవాలు జరుపుకోవడం సంతోషకరంగా ఉందన్నారు.ఈ యూనివర్శిటీలో చదివిన అనేకమంది ప్రపంచవ్యాప్తంగా మంచి వైద్య సేవలు అందిస్తున్నారని చెప్పారు. యూనివర్శిటీ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నాయని గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ పేర్కొన్నారు.