బైక్ను డీ కొట్టిన ఆర్టీసీ బస్సు
ABN , First Publish Date - 2022-07-02T19:41:39+05:30 IST
బైక్ను డీ కొట్టిన ఆర్టీసీ బస్సు
ఎన్టీఆర్: జిల్లాలోని ఏ.కొండూరు మండలం పెద్దతండా సమీపంలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. బైక్ను డీ కొట్టిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో అక్కడికక్కడే వ్యక్తి దుర్మరణం చెందాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. రెడ్డిగూడెం మండలం ముచ్చనపల్లి గ్రామానికి చెందిన రాజు(55)గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆర్. అంకారావు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు.