AP News: అమిత్‌షా , ఎన్టీఆర్ మధ్య రాజకీయ చర్చలు జరగలేదు: కిషన్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-08-22T22:25:20+05:30 IST

అల్లూరి: హైదరాబాద్‌లో నిన్న కేంద్ర మంత్రి అమిత్ షాను జూ. ఎన్టీఆర్ కలవడం సర్వత్రా ఉత్కంఠకు దారితీసింది. అయితే దీనిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టత నిచ్చారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ నటన నచ్చడంతో అమిత్ షా ఆయనను

AP News: అమిత్‌షా , ఎన్టీఆర్ మధ్య రాజకీయ చర్చలు జరగలేదు: కిషన్‌రెడ్డి

అల్లూరి: హైదరాబాద్‌లో నిన్న కేంద్ర మంత్రి అమిత్ షా (Amit Sha)ను జూ. ఎన్టీఆర్ (NTR) కలవడం సర్వత్రా ఉత్కంఠకు దారితీసింది. అయితే దీనిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishna Reddy) స్పష్టత నిచ్చారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ నటన నచ్చడంతో అమిత్ షా ఆయనను భోజనానికి ఆహ్వానించారని చెప్పారు. షా, ఎన్టీఆర్ సినిమా  అంశాలే మాట్లాడుకున్నారని, వారి మధ్య రాజకీయ చర్చలు రాలేదని చెప్పుకొచ్చారు. సీనియర్ ఎన్టీఆర్ చరిత్ర.. సినీ, రాజకీయ రంగాలకు ఆయన చేసిన సేవలపైనే ఎక్కువగా చర్చించారని చెప్పారు. అమిత్‌, ఎన్టీఆర్ భేటీపై విమర్శలకు తాను స్పందిచనని, ఏమైనా ఉంటే వారినే అడగాలని కిషన్‌రెడ్డి సమాధానమిచ్చారు. 

Updated Date - 2022-08-22T22:25:20+05:30 IST