అనూహ్యంగా వ్యూహం మార్చిన రఘురామకృష్ణంరాజు
ABN , First Publish Date - 2022-07-04T03:10:34+05:30 IST
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అనూహ్యంగా వ్యూహం మార్చారు. భీమవరంలో అల్లూరి సీతారామారాజు విగ్రహావిష్కరణకు...
అమరావతి: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అనూహ్యంగా వ్యూహం మార్చారు. భీమవరంలో అల్లూరి సీతారామారాజు విగ్రహావిష్కరణకు ఆయన హాజరుకానున్నారు. అయితే వెహికల్లో భీమవరం వెళ్లేందుకు పోలీసుల అనుమతి కోరారు. కానీ పోలీసులు నిరాకరించారు. దాంతో కలెక్టర్కు రఘురామరాజు ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో రఘురామరాజు రైలులో భీమవరానికి బయల్దేరి వెళ్తున్నారు. హైదరాబాద్ లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి నర్సాపూర్ ఎక్స్ప్రెస్లో రఘురామరాజు భీమవరం బయల్దేరారు. ఈ మేరకు ఆయన ముందుగానే నర్సాపూర్ ఎక్స్ప్రెస్లోని ప్రత్యేక బోగిని బుక్ చేసుకున్నారు. రఘురామరాజుతో పాటు ఏపీ పరి రక్షణ సమితి కన్వీనర్ కొలికపూడి శ్రీనివాస్, మరో 20 మంది నేతలు భీమవరం బయల్దేరారు.
మరోవైపు raghurama rajuను ఏపీ నిఘా టీం ఫాలో అవుతోంది. ఇప్పటికే మోడీ సభ పార్కింగ్లోకి ప్రవేశించేందుకు రఘురామరాజు కారుకు పశ్చిమగోదావరి జిల్లా అధికార యంత్రాంగం పాసులు ఇవ్వలేదు. అటు గుంటూరు, విజయవాడ రైల్వే స్టేషన్లలో ఏపీ పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో రఘురామను భీమవరం వరకు రానివ్వరని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. భీమవరంలోని రఘురామరాజు నివాసం వద్ద కూడా నిఘా వర్గాలు ఉన్నట్లు తెలుస్తోంది.