మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టుకు హాజరైన నారా లోకేష్
ABN , First Publish Date - 2022-05-23T16:57:39+05:30 IST
మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హాజరయ్యారు.
విజయవాడ : మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హాజరయ్యారు. కేసు విచారణలో భాగంగా కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ సమయంలో.. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ లోకేష్, కొల్లు రవీంద్రపై పోలీసులు కేసు నమోదు చేశారు. లోకేష్తో పాటు కొల్లు రవీంద్ర కోర్టుకు హాజరయ్యారు. కోర్టు దగ్గర నేతలు అనుసరిస్తున్న విధానాన్ని పోలీసులు తప్పుబట్టారు. కోర్టు దగ్గర టాస్క్ఫోర్స్ పోలీసులకు ఏం పనంటూ టీడీపీ నేతలు మండిపడ్డారు. కోర్టు దగ్గరకు టీడీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. పోలీసులు అడ్డుకున్నారు.