అమరావతి రైతులకు సీఎం జగన్ క్షమాపణ చెప్పాలి: నాదెండ్ల మనోహర్
ABN , First Publish Date - 2022-03-03T21:40:03+05:30 IST
సీఎం జగన్ అమరావతి రైతులకు క్షమాపణ చెప్పాలని జనసేన నేత నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతి రైతులకు క్షమాపణ చెప్పాలని జనసేన నేత నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. ఏపీ హైకోర్టు తీర్పును మనస్పూర్తిగా స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ధర్మం గెలుస్తుందని, న్యాయం నిలబడుతుందని నమ్మి ఉద్యమం చేసిన రైతులకు అభినందనలు తెలిపారు. జగన్ మూర్కపు పాలనతో లక్షన్నర కోట్ల పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్ళాయన్నారు. మూడు రాజధానుల బిల్లు తెచ్చే వరకు తమకు తెలియదని ఏపీ మంత్రులు తనతో చెప్పారన్నారు. హైకోర్టు తీర్పును ప్రభుత్వం అమలు పరిచే వరకు జనసేన పోరాడుతుందని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.