TDP: పల్నాడు జిల్లాలో దారుణం.. టీడీపీ నేతపై గొడ్డళ్లతో దాడి

ABN , First Publish Date - 2022-07-19T13:55:31+05:30 IST

రొంపిచెర్ల మండల టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై హత్యాయత్నం జరిగింది.

TDP: పల్నాడు జిల్లాలో దారుణం.. టీడీపీ నేతపై గొడ్డళ్లతో దాడి

పల్నాడు: జిల్లాలో వైసీపీ (ycp) మూకలు మరోసారి రెచ్చిపోయాయి. అన్యాయాన్ని ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తూ ప్రత్యర్థి వర్గాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా పల్నాడులోని  తెలుగుదేశం (TDP) రొంపిచెర్ల ( Rompicherla) మండల అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డి(Balakotireddy)పై వైసీపీ నేతలు హత్యాయత్నం చేశారు. ఈ దాడితో పల్నాడు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రొంపిచెర్ల మండలంలోని  అలవల గ్రామంలో  వెన్నా బాలకోటిరెడ్డి మార్నింగ్ వాక్‌కు వెళ్లారు. ఈ సమయంలో బాలకోటిరెడ్డిపై ప్రత్యర్థులు ఒక్కసారిగా గొడ్డళ్లతో విచక్షణ రహీతంగా దాడి చేశారు. ఈ దాడిలో బాలకోటిరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలయిన బాలకోటిరెడ్డిని నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గతంలో రొంపిచెర్ల  ఎంపీపీగా బాలకోటిరెడ్డి పని చేశారు. ఈ దాడిపై తెలుగుదేశం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

Updated Date - 2022-07-19T13:55:31+05:30 IST