బాలశౌరి, పేర్ని నానిల మధ్య మరింత ముదురుతున్న వివాదం..

ABN , First Publish Date - 2022-11-30T10:25:20+05:30 IST

కృష్ణా జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య వివాదం మరింత ముదురుతోంది.

బాలశౌరి, పేర్ని నానిల మధ్య మరింత ముదురుతున్న వివాదం..

Vijayawada : కృష్ణా జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఇప్పటికే ప్రతి ఒక్క అంశంలోనూ విరుద్ధ ప్రకటనలు చేస్తూ కార్యకర్తలను గందరగోళానికి గురి చేస్తున్న ఈ ఇరువురు నేతలూ.. తాజాగా బందరు పోర్ట్ పనుల‌ పైనా ఇరువురూ పోటాపోటీగా ప్రకటనలు చేస్తున్నారు. ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే పేర్ని నానిల మధ్య పోరుతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు. ఈ నెలలో పోర్టు పనులు ప్రారంభమవుతాయని గతంలో ఎంపీ బాలశౌరి ప్రకటించారు. ఎంపీ ప్రకటనకు విరుద్ధంగా ఎమ్మెల్యే నేడు మరో కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

Updated Date - 2022-11-30T10:25:22+05:30 IST