ధాన్యం కొనుగోళ్ల కుంభకోణంపై పిల్లి సుభాష్ సీరియస్
ABN , First Publish Date - 2022-05-19T14:45:03+05:30 IST
రబీ ధాన్యం కొనుగోళ్లలో కుంభకోణంపై ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సీరియస్ అయ్యారు.
కాకినాడ: రబీ ధాన్యం కొనుగోళ్లలో కుంభకోణంపై ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారంపై కాసేపట్లో కోనసీమ జిల్లా కలెక్టర్ను కలవాలని నిర్ణయించారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి 17 వేల మంది రైతులు ఆధార్తో లింక్ కాలేదని నిన్న రాజమండ్రిలో ఎంపీ ఆరోపించిన విషయం తెలిసిందే. రైస్ మిల్లుల యజమానులు, అధికారులు ఆధార్ లింక్ చేయకుండా తెలివిగా రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కుంభకోణానికి సంబంధించి తన వద్ద ఉన్న ఆధారాలు కలెక్టర్కు బోస్ అందజేయనున్నారు. దీనిపై సీఐడీ విచారణ కోరే అవకాశం ఉంది.