వైసీపీలో ఇప్పుడు.. ఆ పదవుల కోసం కొట్లాట?: జీవీఎల్
ABN , First Publish Date - 2022-04-11T23:52:27+05:30 IST
వైసీపీలో అసమ్మతి సెగలు కమ్ముకుంటున్నాయని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు.
అమరావతి: వైసీపీలో అసమ్మతి సెగలు కమ్ముకుంటున్నాయని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘నిన్నటివరకు మాకు ఒక్కడే నాయకుడు అన్నవాళ్లు.. ఇప్పుడు పదవుల కోసం కొట్లాడుకుంటున్నారు. ఏడుపులు, పెడబొబ్బలతో వైసీపీ పతనం మొదలైంది. మంత్రివర్గ కూర్పులో జగన్ పాటించిన విధానం ఏంటి? మంత్రులను తొలగించడంలో సలహాదారుడికి అధికారం ఎక్కడిది?.ప్రధాన సలహాదారు రాజ్యాంగ బద్ధమైన పదవి కాదు.. సజ్జల వ్యవహారంపై సీఎం జగన్ సమాధానం చెప్పాలి. కమ్మ, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ కులాల నేతలను అణగదొక్కారు’’ అని జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు.