MP CM Ramesh: సీఎం జగన్‌కు పిచ్చి బాగా ముదిరింది..

ABN , First Publish Date - 2022-09-21T20:44:58+05:30 IST

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పుపై బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

MP CM Ramesh: సీఎం జగన్‌కు పిచ్చి బాగా ముదిరింది..

అమరావతి (Amaravathi): ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ (NTR Health University) పేరు మార్పుపై బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌ (CM Ramesh) ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan)కు పిచ్చి బాగా ముదిరిందన్నారు. అధికార మదం తలకు ఎక్కి పేర్లు మార్పు చేస్తున్నారని మండిపడ్డారు. బుద్ధి, జ్థానం లేకుండా వైసీపీ ఎమ్మెల్యేలు ఎలా ఆమోదించారని ఆయన ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ ఆభిమానులమని చెప్పుకునే వైసీపీ నేతల చర్య సిగ్గుచేటన్నారు. జగన్‌ ప్రభుత్వానికి పోయేకాలం దగ్గరకు వచ్చింది.. అందుకే ఇలాంటి చర్యలకు దిగుతున్నారని అన్నారు. ఎన్టీఆర్‌ పేరు తొలగింపుపై ప్రతి తెలుగువాడు తిరగబడాలని, ఎన్టీఆర్ పేరు మార్పు నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు పోరాటం చేయాలని సీఎం రమేష్‌ పిలుపిచ్చారు.

Updated Date - 2022-09-21T20:44:58+05:30 IST