విభజన హామీలపై మోదీ తీరు దారుణం

ABN , First Publish Date - 2022-07-05T08:02:22+05:30 IST

మూడేళ్ల తర్వాత రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్‌ విభజన హామీల అమలుపై ఒక్కమాట మాట్లాడకపోవడం దారుణం, బాధాకరమని ప్రత్యేక హోదా, విభజన

విభజన హామీలపై మోదీ తీరు దారుణం

నేడు ప్రజాసంఘాలు, విపక్షాలు నిరసనలు తెలపాలి: చలసాని


గుంటూరు, జూలై 4: మూడేళ్ల తర్వాత రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్‌ విభజన హామీల అమలుపై ఒక్కమాట మాట్లాడకపోవడం దారుణం, బాధాకరమని ప్రత్యేక హోదా, విభజన హామీల సాఽధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ తెలిపారు. అల్లూరి 125 జయంతి పురస్కరించుకుని సోమవారం ఆయన గుంటూరు నాజ్‌ సెంటర్‌లో సీతారామరాజు విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రధాని తీరుకు నిరసనగా మంగళవారం రాష్ట్రంలోని ప్రజా సంఘాలు, విపక్షాలు నిరసనలు తెలియజేయాలని పిలుపునిచ్చారు. హామీల అమలు కోసం భవిష్యత్‌లో విస్తృత కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. ఉద్యమ ప్రధాత అల్లూరి సీతారామరాజు ఆశయాలను కొనసాగించాలని కోరారు. 

Updated Date - 2022-07-05T08:02:22+05:30 IST