పనికిరాని సలహాదారులకు రూ.కోట్లు ఇస్తున్నారు కానీ..: ఎమ్మెల్యే అనగాని
ABN , First Publish Date - 2022-01-25T20:25:15+05:30 IST
జగన్మోహన్ రెడ్డి తన సలహాదారులకు ఇచ్చిన ప్రాధాన్యత.. ఉద్యోగులకు ఎందుకు ఇవ్వడం లేదని...
విజయవాడ: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సలహాదారులకు ఇచ్చిన ప్రాధాన్యత.. ఉద్యోగులకు ఎందుకు ఇవ్వడం లేదని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ప్రశ్నించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పనికిరాని సలహాదారులకు రూ. కోట్లు ఇస్తున్నారు కానీ.. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉన్న ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించరా? అని నిలదీశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చమంటే ఆర్థిక పరిస్థితులు బాగోలేవంటారా? అంటూ మండిపడ్డారు. కరోనా సమయంలో సలహాదారులు ఇళ్లల్లో కూర్చుంటే..ఉద్యోగులు మాత్రం తమ ప్రాణాలు పణంగా పెట్టి పని చేశారన్నారు. ఉద్యోగులంటే జగన్రెడ్డికి, వైసీపీ ఎంపీలకు ఎందుకంత చులకనభావమని అనగాని సత్యప్రసాద్ ప్రశ్నించారు.