ఆర్టీసీ ఛార్జీల పెంపుపై మంత్రి విశ్వరూప్ కీలక వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2022-04-16T23:30:13+05:30 IST
ఆర్టీసీ ఛార్జీల పెంపుపై రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కాకినాడ: ఆర్టీసీ ఛార్జీల పెంపుపై రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం అన్నవరంలో పర్యటించారు. ఈసందర్భంగా మంత్రి విశ్వరూప్ మీడియాతో మాట్లాడుతూ.. మంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే ఆర్టీసీ ఛార్జీలు పెంచాల్సి రావడం బాధాకరమన్నారు.ఆర్టీసీని కాపాడుకోవడానికే ఛార్జీలు పెంచాల్సి వచ్చిందని చెప్పారు. తెలంగాణతో పోల్చుకుంటే ఏపీలో ఆర్టీసీ ఛార్జీలు అత్యల్పమన్నారు. రెండేళ్ల క్రితమే తెలంగాణ ఆర్టీసీ డీజిల్ పై సెస్ విధించిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైందని మంత్రి విశ్వరూప్ తెలిపారు.