నిందితులెవరైనా వదిలేది లేదు: Minister Raja
ABN , First Publish Date - 2022-05-25T16:37:05+05:30 IST
కోనసీమ జిల్లాలో విధ్వంసకాండకు సంబంధించి నిందితులెవరైనా వదిలేది లేదని మంత్రి దాడిశెట్టి రాజా స్పష్టం చేశారు.
అమరావతి: కోనసీమ జిల్లాలో విధ్వంసకాండకు సంబంధించి నిందితులెవరైనా వదిలేది లేదని మంత్రి దాడిశెట్టి రాజా స్పష్టం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... పక్కాప్లాన్ ప్రకారమే విధ్వంసం సృష్టించారని ఆరోపించారు. విపక్షాలకు వ్యవస్థలపై గౌరవం లేదన్నారు. అన్నిపార్టీల అంగీకారంతోనే జిల్లా పేరు మార్చారని తెలిపారు. చంద్రబాబు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి దాడిశెట్టి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు.