ఇరుకుపాలెం రైతు భరోసా కేంద్రానికి తాళం
ABN , First Publish Date - 2022-06-06T15:59:50+05:30 IST
జిల్లాలోని ముప్పాళ్ళ మండలం ఇరుకుపాలెం రైతు భరోసా కేంద్రానికి తాళం పడింది.
పల్నాడు: జిల్లాలోని ముప్పాళ్ళ మండలం ఇరుకుపాలెం రైతు భరోసా కేంద్రానికి తాళం పడింది. భరోసా కేంద్రానికి గత ఏడాదిగా అధికారులు అద్దె చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేశారు. అద్దె విషయంపై యజమాని బత్తుల రోశయ్య పలుసార్లు విన్నవించినా పట్టించుకోని పరిస్థితి. దీంతో రైతు భరోసా కేంద్రానికి తాళం వేశాడు. తన ఆరోగ్య పరిస్థితి సరిగాలేదని అద్దె ఇవ్వాలని యజమాని డిమాండ్ చేశాడు.