Kurnool: 108 అంబులెన్స్ డ్రైవర్, టెక్నీషియన్పై దాడి
ABN , First Publish Date - 2022-06-20T16:07:12+05:30 IST
జిల్లాలోని ఆదోని పట్టణంలో మాతా శిశు ఆసుపత్రి దగ్గర 108 అంబులెన్స్ డ్రైవర్, టెక్నీషియన్పై కొందారు యువకులు దాడి చేశారు.
కర్నూలు: జిల్లాలోని ఆదోని పట్టణంలో మాతా శిశు ఆసుపత్రి దగ్గర 108 అంబులెన్స్ డ్రైవర్, టెక్నీషియన్పై కొందరు యువకులు దాడి చేశారు. అంబులెన్స్కు అడ్డుగా ఉన్న స్కూటర్ తీయాలంటూ అంబులెన్స్ డ్రైవర్ అడగటంతో... గౌళీ పేటకు చెందిన యువకులు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్, టెక్నీషియన్ ప్రస్తతం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.