విశాఖ రైల్వే కోర్టుకు మాజీమంత్రి కొణతాల
ABN , First Publish Date - 2022-04-18T21:18:04+05:30 IST
విభజన హామీలు, రైల్వే జోన్, ఉత్తరాంధ్ర ప్రత్యేక నిధులు అమలు కోసం 2018-19లో ఛలో ఢిల్లీ రైలుయాత్ర చేసిన సందర్భంగా మాజీమంత్రి కొణతాల రామకృష్ణ పై ఆర్పీఎఫ్ పోలీసులు కేసు నమోదు..
విశాఖపట్నం: విభజన హామీలు, రైల్వేజోన్, ఉత్తరాంధ్ర ప్రత్యేక నిధుల అమలు కోసం 2018-19లో ఛలో ఢిల్లీ రైలుయాత్ర చేసిన సందర్భంగా మాజీమంత్రి కొణతాల రామకృష్ణ పై ఆర్పీఎఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసు విచారణలో భాగంగా విశాఖ రైల్వే కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసును వచ్చే నెల 4వ తేదీకి వాయిదా వేసినట్లు తెలిపారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖకు రైల్వే జోన్ వచ్చింది.. కానీ డివిజన్ను విడదీసే ప్రక్రియ వేగవంతంగా జరుగుతుందని ఇది చాలా అన్యాయమని కొణతాల రామకృష్ణ చెప్పారు.