తిరుపతికి కొలికపూడి కృతజ్ఞతా పాదయాత్ర
ABN , First Publish Date - 2022-03-13T02:10:34+05:30 IST
ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు తిరుపతి వరకు కృతజ్ఞతా పాదయాత్రను శనివారం
తుళ్ళూరు: ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు తిరుపతి వరకు కృతజ్ఞతా పాదయాత్రను శనివారం తుళ్లూరు శివాయలం నుంచి ప్రారంభించారు. తొలుత ఆలయంలో పూజలు నిర్వహించారు. పాదయాత్రకు బయలుదేరిన శ్రీనివాసరావుకు రాజధాని మహిళలు గుమ్మడికాయతో దిష్టి తీశారు. అమరావతి రాజధాని ఐక్యకార్యచరణ సమితి అధ్యక్షుడు పువ్వాడ సుధాకరరావు రైతు జెండాను ఊపి పాదయాత్రను ప్రారంభించారు. జై అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ పాదయాత్ర సందర్భంగా రైతులు మహిళలు నినాదాలు చేశారు. పెదపరిమి శిబిరం వద్ద రైతులు పాదయాత్రకు స్వాగతం పలికారు. రైతు జేఏసీ నేతలు పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. 15 మంది రైతులు శ్రీనివాసరావుతో పాటు పాదయాత్రలో పాల్గొంటున్నారు.