AP News: ఏపీ ఆర్థిక పరిస్థితులపై నేడు ఢిల్లీలో కీలక సమావేశం

ABN , First Publish Date - 2022-08-25T16:11:32+05:30 IST

ఏపీ ఆర్థిక పరిస్థితులపై గురువారం ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది.

AP News: ఏపీ ఆర్థిక పరిస్థితులపై నేడు ఢిల్లీలో కీలక సమావేశం

ఢిల్లీ (Delhi): కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో గురువారం సాయంత్రం 3 గంటలకు ఆంధ్రప్రదేశ్ (Andhra padesh) ఆర్థిక పరిస్థితులపై కీలక సమావేశం జరగనుంది. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టివి సోమనాథన్ (TV Somanathan) నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర విభజన అంశాలు, రాష్ట్ర ఆర్థిక సంబంధిత విషయాలు, ఏపీ (AP)కి కేంద్రం నుంచి ఇవ్వాల్సిన నిధులపై చర్చించనున్నట్లు సమాచారం. ప్రధాని మోదీ (PM Modi) ఆదేశం మేరకు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నేతృత్వంలో కేంద్ర అధికారుల బృందం.. ఏపీ రాష్ట్ర అధికారులతో భేటి కానుంది. నార్త్ బ్లాక్‌లోని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయంలో  సమావేశం జరగనుంది. ఈ భేటీకి ఏపీ ప్రభుత్వం తరపున విజయసాయిరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పలు శాఖల అధికారులు హాజరుకానున్నారు.

Updated Date - 2022-08-25T16:11:32+05:30 IST