దళిత యువకుని ఆత్మహత్యకు కావలి ఎమ్మెల్యే కారణం: టీడీపీ
ABN , First Publish Date - 2022-12-31T05:34:24+05:30 IST
నెల్లూరు జిల్లా కావలి వైసీపీ ఎమ్మెల్యే ప్రతాప కుమార్ రెడ్డిపై డీజీపీకి తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది.
అమరావతి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లా కావలి వైసీపీ ఎమ్మెల్యే ప్రతాప కుమార్ రెడ్డిపై డీజీపీకి తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది. దళిత యువకుడు పైడి హర్ష ఆత్మహత్య చేసుకోవడానికి ఎమ్మెల్యే వేధింపులే కారణమని, అతనిపై తక్షణం ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఈ మేరకు డీజీపీ రాజేంద్రనాథ రెడ్డికి శుక్రవారం ఒక లేఖ రాశారు.