ఏపీ ఆర్థిక పరిస్థితికి కాగ్ నివేదికే నిదర్శనం: ఎంపీ కనకమేడల
ABN , First Publish Date - 2022-04-08T19:55:03+05:30 IST
వైసీపీది అవినీతి, అసమర్థ ప్రభుత్వమని ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ విమర్శించారు.
న్యూఢిల్లీ: వైసీపీది అవినీతి, అసమర్థ ప్రభుత్వమని టీడీపీ సీనియర్ నేత, ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ విమర్శించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఏపీ ఆర్థిక పరిస్థితికి కాగ్ నివేదికే నిదర్శనమన్నారు. బిల్లులు లేకుండా రూ. 41 వేల కోట్లు ఖర్చు చేశారన్న..కాగ్ నివేదిక వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం ట్రెజరీ సిస్టమ్ ప్రకారం వెళ్లలేదని మూడేళ్లలో వైసీపీ చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలన్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని కనకమేడల డిమాండ్ చేశారు.