Kala Venkatarao: సీఎం నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు
ABN , First Publish Date - 2022-07-19T18:42:20+05:30 IST
ప్రజలు వరదల్లో అల్లాడుతుంటే సీఎం జగన్రెడ్డి నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశ సీనియర్ నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావు అన్నారు.
అమరావతి: ప్రజలు వరదల్లో అల్లాడుతుంటే సీఎం జగన్రెడ్డి( CM JAGAN) నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశ సీనియర్ నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావు(Kala Venkatarao) అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అన్నిటికీ బటన్ నొక్కే సీఎం...వరద బాధితుల సహాయం బటన్ ఎందుకు నొక్కలేదు.వరద సహాయం ఇవ్వాల్సి వస్తుందని ....బటన్ నొక్కే చేయి సీఎం దాచుకున్నట్లు ఉన్నారు. విపత్తులకు చంద్రబాబు(CHANDRABABU) ఎదురెళ్తారు....సీఎం జగన్ వెనుక ఉంటారు. వరద బాధితులపై కేసులు పెట్టగల సమర్థుడు జగన్. వరదల్లో గత ప్రభుత్వాలు ఏమి చేశాయో సీఎం జగన్ చరిత్ర తెలుసుకోవాలి.వరద బాధిత కుటుంబానికి 2వేల రూపాయలు ఇస్తే సరిపోదు..... 10 వేల రూపాయలు ఇవ్వాలి. 75కేజీల బియ్యం,కందిపప్పు,నూనె అందించాలి’’ అని కళా వెంకట్రావు డిమాండ్ చేశారు.