పులివెందులలో అర్ధరాత్రి దొంగల స్వైర విహారం
ABN , First Publish Date - 2022-04-25T14:14:58+05:30 IST
జిల్లాలోని పులివెందులలో అర్ధరాత్రి దొంగలు స్వైర విహారం చేశారు.
కడప: జిల్లాలోని పులివెందులలో అర్ధరాత్రి దొంగలు స్వైర విహారం చేశారు. రెండు ఆలయాల హుండీలను పగులగొట్టిన దొంగలు డబ్బును దోచుకెళ్లారు. పులివెందులలోని పాతమార్కెట్లో ఉన్న ఆంజనేయస్వామి ఆలయం, సాయిబాబా ఆలయాల్లో తలుపులకు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు హుండీలను పగులగొట్టి డబ్బులు, పలు రకాల వస్తువులను దోచుకెళ్లారు. సాయిబాబా ఆలయంలో సుమారు 4 లక్షలకుపైగా విలువ చేసే వెండి ఆభరణాలు, వస్తువులను అపహరించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.