జగన్తో మంత్రుల భేటీ.. జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చ
ABN , First Publish Date - 2022-03-14T16:19:15+05:30 IST
ఏపీ అసెంబ్లీ సీఎం జగన్తో మంత్రులు ఆళ్ల నాని, పేర్ని నాని, నారాయణ స్వామి భేటీ అయ్యారు.
అమరావతి : ఏపీ అసెంబ్లీ సీఎం జగన్తో మంత్రులు ఆళ్ల నాని, పేర్ని నాని, నారాయణ స్వామి భేటీ అయ్యారు. జంగారెడ్డిగూడెం మరణాలపై సీఎం వద్ద చర్చ జరిగింది. మరణాలకు కారణాలను మంత్రి ఆళ్ల నాని, ఏక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి సీఎంకు వివరించారు. టీడీపీ శవ రాజకీయాలు చేస్తోందని జగన్ పేర్కొన్నారు. వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియాలని ముఖ్యమంత్రి సూచించారు. ఘటనపై సభలో స్పందించాలని ప్రభుత్వం యోచిస్తోంది.