అంబటిపై పోలీసులకు జనసేన ఫిర్యాదు
ABN , First Publish Date - 2022-12-31T05:01:39+05:30 IST
మంత్రి అంబటి రాంబాబుపై శుక్రవారం పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణ పోలీసు స్టేషన్లో జనసేన నేతలు ఫిర్యాదు చేశారు.
సత్తెనపల్లి, డిసెంబరు 30: మంత్రి అంబటి రాంబాబుపై శుక్రవారం పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణ పోలీసు స్టేషన్లో జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. సంక్రాంతి సంబరాలు, ముగ్గుల లక్కీ డ్రా పేరుతో పార్టీ నాయకులు, కార్యకర్తలతో లక్కీ డ్రా కూపన్లు విక్రయింపచేసున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. మంత్రిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలన్నారు.