ఆశావహులపై జగన్ నీళ్లు
ABN , First Publish Date - 2022-03-16T02:21:24+05:30 IST
మంత్రి పదవులను ఆశిస్తున్న ఆశావహులపై జగన్
అమరావతి: మంత్రి పదవులను ఆశిస్తున్న ఆశావహులపై జగన్ నీళ్లు చల్లారు. ఏపీ కేబినెట్ మార్పు ఇప్పట్లో లేనట్లేనని తెలుస్తోంది. పార్టీ ప్లీనరీ తర్వాతే కేబినెట్ మార్పు ఉంటుందని వైసీఎల్పీ భేటీలో జగన్ క్లారిటీ ఇచ్చినట్లు అనధికార వర్గాలు తెలిపాయి. ఇదే విషయాన్ని మంత్రులకు సీఎం స్పష్టం చేశారు. ఉగాదికి కేబినెట్ విస్తరణ అంటూ బ్లూ మీడియా హడావుడి చేసింది. అయితే దీనిపై శాసనసభ పక్ష సమావేశంలో జగన్ క్లారిటీ ఇచ్చారు. వైసీపీ ప్లీనర్ జులై 8 తర్వాతనే కేబినెట్ పునర్వ్యస్థీకరణ ఉంటుందని జగన్ పేర్కొన్నారు. ప్లీనరీలో కీలక నిర్ణయాలు ఉంటాయని జగన్ స్పష్టం చేశారు.