cm jagan: మంత్రులు, ఎమ్మెల్యేలకు జగన్ చురకలు
ABN , First Publish Date - 2022-09-28T23:51:01+05:30 IST
కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం జగన్ (cm jagan) చురకలంటించారు. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు
అమరావతి: కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం జగన్ (cm jagan) చురకలంటించారు. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు సర్వే నివేదికను సీఎం జగన్ వెల్లడించారు. గడపగడపకు కార్యక్రమంలో 27 మంది చురుకుగా లేరంటూ మండిపడ్డారు. 27 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని సీఎం తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్చార్జ్లపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. 27 మంది 16 రోజులు మాత్రమే తిరిగారని, వారి పేర్లు వెల్లడించే పరిస్థితి తీసుకురావద్దని జగన్ సూచించారు. పనితీరు మెరుగుపరచుకోవాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు. లేనిపక్షంలో చర్యలు తీసుకుంటానని హెచ్చరించినట్లు సమాచారం. తీరు మార్చుకోకపోతే సీటు ఇచ్చేది లేదని జగన్ తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. నవంబర్లో మరోసారి ఎమ్మెల్యేల పనితీరు సమీక్షిస్తానని తెలిపారు. ఎన్నికలకు 6 నెలల ముందే సీటు ఇవ్వనివారి పేర్లు ప్రకటిస్తానని జగన్ వెల్లడించారు.