ఢిల్లీ భేటీ వివరాలను జగన్ వెల్లడించాలి: సీపీఐ
ABN , First Publish Date - 2022-12-31T05:08:45+05:30 IST
ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, ఇతర కేంద్ర మంత్రులతో సమావేశమై చర్చించిన అంశాలు, వాటిపై కేంద్ర ప్రభుత్వం స్పందన ఏమిటో మీడియా ద్వారా జగన్ రాష్ట్ర ప్రజలకు తెలపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు.
అమరావతి, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, ఇతర కేంద్ర మంత్రులతో సమావేశమై చర్చించిన అంశాలు, వాటిపై కేంద్ర ప్రభుత్వం స్పందన ఏమిటో మీడియా ద్వారా జగన్ రాష్ట్ర ప్రజలకు తెలపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో లక్షలాది పెన్షన్ల తొలగింపు, టిడ్కో ఇళ్ల సాధన కోసం ఫిబ్రవరి 6న నిరసన ప్రదర్శనలు, 22న విజయవాడలో మహాధర్నా నిర్వహిస్తామని తెలిపారు.