మీరు ఒకటి అంటే మా వాళ్ళు పది మాటలంటారు: అచ్చెన్నతో జగన్
ABN , First Publish Date - 2022-09-15T18:01:35+05:30 IST
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి(Atchennaidu)తో ఏపీ సీఎం జగన్(CM Jagan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Amaravathi: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి(Atchennaidu)తో ఏపీ సీఎం జగన్(CM Jagan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మీరు ఏమీ అనకుంటే మా వాళ్లు అనరు. మీరంటే మాత్రం మావాళ్లూ అంటారు’ అన్నట్టుగా మాట్లాడారు. అసలేం జరిగిందంటే.. నేడు జరిగిన బీఏసీ సమావేశం(BAC Meeting)లో సీఎం జగన్, అచ్చెన్నల మధ్య సంభాషణ జరిగింది. తమ సీఎంను అంటే ఊరుకునేది లేదని బుగ్గన(Buggana), జోగి రమేశ్(Jogi Ramesh) పేర్కొన్నారు.
దీనిలో భాగంగా.. అచ్చెన్నతో సీఎం మాట్లాడుతూ.. ‘‘మనం రాజకీయ నాయకులం.. మనలో మనం వందనుకుంటాం. కుటుంబ సభ్యుల జోలికి రావాలనుకోం. కుటుంబ సభ్యుల జోలికి మీరొస్తే మా ముఖ్యమంత్రిని అంటారా అని మావాళ్లూ అంటారు. మీరు మానేస్తే మావాళ్లూ ఆటోమెటిక్గా మానేస్తారు. మీరు ఒకటి అంటే మా వాళ్ళు పది మాటలంటారు’ అంటూ అచ్చెన్నకు హితబోధ చేశారు. అనంతరం.. ‘మీ ప్రశ్నలూ మేం లేవనెత్తబోయేవీ దాదాపు ఒక్కటే అన్నీ చర్చిద్దాం’ అని జగన్ పేర్కొన్నారు.