Srisailam జలాశయానికి పెరిగిన వరద ఉధృతి
ABN , First Publish Date - 2022-07-16T14:21:21+05:30 IST
శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరిగింది. ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో 3 లక్షల 67 వేల 698 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 12 వేల 714 క్యూసెక్కులుగా ఉంది.

నంద్యాల: శ్రీశైలం(Srisailam) జలాశయానికి వరద ఉధృతి పెరిగింది. ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో 3 లక్షల 67 వేల 698 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 12 వేల 714 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుతం 848.30 అడుగులకు చేరింది. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలకు గాను.. ప్రస్తుతం 76.3162 టీఎంసీలుగా కొనసాగుతోంది. శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.