బిచ్చగాడి గదిలో..డబ్బు మూటలు
ABN , First Publish Date - 2022-06-03T08:11:31+05:30 IST
భిక్షాటన చేసుకుని జీవించే సాధువు.. హఠాత్తుగా గుండెపోటుతో చనిపోయాడు. అతడి గదిలో రెండు సంచి మూటలు కనిపించాయి. వాటిని విప్పితే..
- గుండెపోటుతోమృతిచెందిన సాధువు
- రూ.2 లక్షల వరకూ లభ్యం
కరప, జూన్ 2: భిక్షాటన చేసుకుని జీవించే సాధువు.. హఠాత్తుగా గుండెపోటుతో చనిపోయాడు. అతడి గదిలో రెండు సంచి మూటలు కనిపించాయి. వాటిని విప్పితే.. వందలాది పాలిథిన్ కవర్లు ఉన్నాయి. ఆ కవర్లలో వేలాది కరెన్సీ నోట్లు... చిల్లర నాణేలు కనిపించాయి. కాకినాడ జిల్లా కరప మండలం వేళంగి గ్రామంలో గురువారం చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. ఆ సాధువు పేరు రామకృష్ణ. ఐదేళ్ల కిందట గ్రామానికి వచ్చాడు. భిక్షాటన చేస్తూ.. రక్ష రేకులు కడుతూ జీవనం సాగించేవాడు. చేపల మార్కెట్ వద్ద చిన్న గదిలో ఉంటూ సమీపంలోని సత్రంలో భోజనం చేసేవాడు. అతడు గురువారం గుండెపోటుతో చనిపోయాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, విచారణ చేపట్టారు. ఈ విషయమై కరప ఎస్ఐ డి.రమేశ్బాబును మాట్లాడుతూ అతడి వద్ద లభించిన నగదులో పది రూపాయల నోట్లే ఎక్కువగా ఉన్నాయని, చీకటి పడడంతో వాటిని లెక్కించడం సాధ్యపడలేదన్నారు. నోట్లు, చిల్లరను సంచుల్లో పెట్టి సీలు వేసి స్టేషన్కు తరలించామని, శుక్రవారం లెక్కిస్తామని చెప్పారు. పంచాయతీ కార్మికులతో సహాయంతో మృతదేహాన్ని ఖననం చేసినట్టు తెలిపారు. కాగా, అతడి వద్ద లభించిన నగదు రూ.2లక్షలకు పైనే ఉంటుందని స్థానికులు అంచనా వేస్తున్నారు.