ఎమ్మెల్సీ ఎన్నికల బీజేపీ ఇన్‌చార్జిగా వాకాటి

ABN , First Publish Date - 2022-08-31T09:09:01+05:30 IST

రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఇన్‌చార్జిగా వాకాటి నారాయణరెడ్డిని బీజేపీ నియమించింది. పా

ఎమ్మెల్సీ ఎన్నికల బీజేపీ ఇన్‌చార్జిగా వాకాటి

విజయవాడ, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఇన్‌చార్జిగా వాకాటి నారాయణరెడ్డిని బీజేపీ నియమించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రాష్ట్ర ఇన్‌చార్జితోపాటు ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలను మంగళవారం నియమించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి పైడి వేణుగోపాల్‌ను, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి కందుకూరి సత్యనారాయణ, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల నియోజకవర్గానికి కేబీఎన్‌బీ నరసింగరావును నియమించారు.

Updated Date - 2022-08-31T09:09:01+05:30 IST