పోలీసుల త్యాగాలు అభినందనీయం

ABN , First Publish Date - 2022-08-01T09:18:20+05:30 IST

కరోనా, వరద లాంటి విపత్కర పరిస్థితుల్లో పోలీసులు ఎన్నో త్యాగాలు చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడం అభినందనీయమని..

పోలీసుల త్యాగాలు అభినందనీయం

హోం మంత్రి వనిత 


అనంతపురం క్రైం, జూలై 31: కరోనా, వరద లాంటి విపత్కర పరిస్థితుల్లో పోలీసులు ఎన్నో త్యాగాలు చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడం అభినందనీయమని రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.  అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలకు సంబంధించి అనంతపురం నగరంలోని పోలీసు శిక్షణ కళాశాల (పీటీసీ)లో ఆదివారం రీజినల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ (ఆర్‌ఎ్‌ఫఎ్‌సఎల్‌)ను ప్రారంభించారు.  మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ...  ప్రజలకు సత్వర న్యాయం చేసే దిశగా జీరో ఎఫ్‌ఐఆర్‌ తీసుకొచ్చామని, పరిధుల్లేకుండా బాధితులకు న్యాయం చేస్తున్నామన్నారు.  డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రంలో 13 వేల శ్యాంపిళ్లను విశ్లేషించి, నివేదికలు సంబంధిత పోలీసు స్టేషన్లకు పంపే విధంగా పోరెన్సిక్‌ ల్యాబ్‌లు పనిచేయాలన్నారు. రాజమహేంద్రవరంలో కూడా త్వరలో ల్యాబ్‌ను ప్రారంభిస్తామన్నారు. 

Updated Date - 2022-08-01T09:18:20+05:30 IST